ప్రముఖ సినీ నటుడు మాస్ మహారాజ్ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రద్ధాంజలిగా హైదరాబాదులో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై, రవితేజను ప్రత్యక్షంగా పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంలో తండ్రి కోల్పోయిన బాధను ఎదుర్కొంటున్న రవితేజ కుటుంబానికి ధైర్యం చెప్పి, కష్టకాలంలో తాము సంఘీభావంగా ఉన్నామని చెప్పారు.పరామర్శించిన వారిలో సురేష్ రాజు, బాబు, మాదారపు వీరబాబు, పాముల చంటి తదితరులు కూడా పాల్గొన్నారు. రవితేజతో కలిసి కొంతసేపు మౌనంగా కూర్చుండి ఆయన తండ్రికి నివాళులు అర్పించారు.