పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఎనిమిది, తొమ్మిది, పది వార్డులలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్ వర్క్ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని డ్రైనేజీలలో చెత్తను వేయడం వల్ల చెత్త పేరుకుపోయి డ్రైనేజీలలో ము రుగునీరు నిలిచి ఉండిపోవడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులోనూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నారని అయినప్పటికీ ప్రజలు చెత్తను రోడ్డుపైన డ్రైనేజీలలో వేయడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఖాళీ స్థలాలలో మొక్కలు పెరిగి విష పురుగులు చేరుతున్నాయని ఖాళీ స్థలాల యాజమానులు ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సానిటరీ మేస్త్రిలు రాజన్న అప్పారావు రాజు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు