WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మీరందరూ గర్వపడేలా ఆదిరెడ్డి కుటుంబం ఉంటుంది

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు టిడిపిలోనే ఉంటాం లేకుంటే రాజకీయాలు మానేస్తాం..

సన్మానానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన వెలమ సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సన్మాన గ్రహీత ఆదిరెడ్డి వాసు..

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు టిడిపిలోనే ఉంటామని లేకుంటే రాజకీయాలు మానేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు.ఆదివారం జేఎన్ రోడ్ లో ఉన్న చెరుకూరి గార్డెన్స్ కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత,వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘన సన్మానం జరిగింది.

సభా అధ్యక్షత వెలమ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు కిలపర్తి శ్రీను వహించారు.

తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన వేలాదిమంది వెలమ సంఘీయులు, నాయకుల సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు. తనకు సన్మానం చేసిన వెలమ సంఘాల ను ఉద్దేశించి‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో తన కుటుంబాన్ని దారుణంగా రాజకీయంగా వేధింపులకు గురి చేశారని గుర్తు చేసుకున్నారు. మా అన్న నారా లోకేష్ తనను రాజకీయాల్లో వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మా కుటుంబ సభ్యులు అందరూ చర్చించుకుని ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని లేకుంటే రాజకీయాలు మానేస్తామని తెలిపారు. చేతిలో ఉన్నంతవరకు సంక్షేమం, అభివృద్ధి చేస్తానని లేకుంటే పోరాటం చేస్తామని వివరించారు. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. వెలమసంఘీలందరూ గర్వపడేలాగా ఆదిరెడ్డి కుటుంబం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తన సన్మానానికి లోటు పాట్లు లేకుండా చేసిన వెలమ సంక్షేమ సంఘం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తాను రెండు రూపాయలతో రాజమండ్రి వచ్చారని తన జీవితం ఇక్కడే ప్రారంభం అయినట్లు తెలిపారు. తన మామగారు చలుమూరి వెంకటేశ్వరరావు ఆశీస్సులతో తన కుటుంబం రాజకీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఏమీ తెలియని తనకు వ్యాపారం నేర్పించి రాజకీయంగా ఎదిగేలాగా చలుమూరి వెంకటేశ్వర్లు ప్రోత్సహించారని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ కు గత ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోలైనప్పటికీ 73 వేల మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. ఆర్యాపురం కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అందరి మనసులు చూరగొన్న వ్యక్తి అని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు మెప్పించి ఆదిరెడ్డి వీర్రాజు అమ్మకు మేయర్ సీటు వచ్చే విధంగా కృషి చేశారని, అనంతరం కోడలు భవాన్ని 2019లో 35 వేల మెజార్టీతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించే విధంగా కృషి చేశారని అన్నారు. అలాగే 2024లో ఆదిరెడ్డి వాసు‌72 వేలు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో నాలుగు రాజకీయ ప్రాధాన్యత పదవులు పొందిన కుటుంబం రాష్ట్రంలో ఎక్కడా లేదని వివరించారు.‌అన్ని కులాలు ఆదరించే విధంగా ఆదిరెడ్డి వాసు శ్రమ పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘీయులు పెద్ద ఎత్తున పాల్గొని
రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు,ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు,ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్చుత రామారావు (బాబు), వెలమ ప్రతినిధులకు పూలమాల, జ్ఞాపికలు,అందజేసి ఘనంగా సన్మానం నిర్వహించి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, వెలమ యువత అధ్యక్షుడు కొల్లి వెంకట దుర్గాప్రసాద్ (బుజ్జి),కొల్లివెలసి హరిక,చలుమూరి శ్రీనివాసరావు,చల్లా కేశవ్,చల్లా బాలమురళీకృష్ణ, సప్పా వెంకటరమణ,వెలమ యువత కార్యదర్శి యాళ్ళ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement