WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని,జగన్ పాలనలో జరిగిన దోషాలకు,పాపాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు వద్దనున్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సనాతన ధర్మ పరిరక్షణ భక్తి కార్యక్రమాన్ని చేపట్టారు.తిరుమల స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కంబాల చెరువు నుండి దేవీ చౌక్ వరకు ప్రాయశ్చిత్త పాదయాత్ర చేశారు.అనంతరం ఆలయంలో భక్తులంతా స్వామివారి కీర్తనలతో భజన నిర్వహించారు. ఈ సందర్భంగా వై. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞానం పంచిన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను అందరికీ తెలియచేసేందుకే జనసేన పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్టు తెలిపారు. జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి వైసీపీ పాలకులు చేసిన మహా పాపం ఎవరికి అంటకూడదని స్వామివారిని కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రధాన అర్చకులు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించి, భక్తులకు ఆశీస్సులు అందచేసారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీ అను శ్రీ సత్యనారాయణ,జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, తేజ మూర్తుల నరసింహ మూర్తి,భాషా లిమ్ర,జనసేన నగర్ కమిటీ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement