ఈ నెల 20వ తేదీన భారీగా అన్నదానం…
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:స్థానిక మంగళవారపుపేట కొబ్బరి కాయల మార్కెట్ దగ్గర శ్రీ విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతు న్నాయి.ఆలయ ధర్మకర్తలు, వైఎస్ఆర్సీపీ 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంకే సురేష్ కుమార్, సుధారాణి (మాజీ కార్పొరేటర్) దంపతులు,ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో 20వ వార్షిక దేవీ శరన్నరాత్రి మహోత్స వాలలో భాగంగా బుధవారం మూలా నక్షత్రం సందర్బంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంతో పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా పెంకే సురేష్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు,మా సోదరులు కలిసి నిర్మించారని, అప్పటి నుంచి ప్రతియేటా ఉత్సవాలు చేస్తున్నామని, ఈ ఏడాది 20వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు, సహచరులు, భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజని,సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిస్తున్నారని తెలిపారు. తెల్లవారుఝా మున దంపతులతో కుంకుమ పూజలు జరిగాయని, ఆతర్వాత పిల్లలతో సరస్వతి పూజలు, అక్షరాభ్యాసాలు జరిగాయని వివరించారు. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిని ఆయన అన్నారు. అందుకే ఈ ప్రాంతం వారే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వచ్చి కోరికలు కోరుకోవడం,అవి నెరవేరతాయని ఆనందం వ్యక్తం చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. దుర్గాష్టమి నాడు ఘనంగా పూజలు నిర్వహిస్తామని, వందల సంఖ్యలో భక్తులు కూడా వస్తారని సురేష్ కుమార్ తెలిపారు.అమ్మవారు అందరికి సుఖ సంతోషాలు కలిగేలా చూడాలని కోరుకున్నారు.20వ తేదీన భారీగా అన్నదానం నిర్వహిస్తామని, భక్తులు విచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిల్లంపల్లి రాజు,కర్రీ శ్రీను,చల్లా గణేష్,భాస్కర్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.