శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో "స్వర ప్రభంజనం" కార్యక్రమం…
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో “స్వర ప్రభంజనం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం తెలిపారు. గతంలో 50 పాటలు పాడి అర్థశత గానప్రభ,75సినీ గీతాలు పాడి వజ్రామృత గానప్రభ బిరుదు పొందిన వర్థమాన గాయనీమణి కొరుకొండ ప్రభచే 116 పాటలతో సినీ సంగీత విభావరి జరుగుతుందని పేర్కొన్నారు.అలాగే పలువురు గాయనీ గాయకులు షేక్ మదరషా అలి,మల్లాది రాజేశ్వరరావు, బి.హెచ్.రామకృష్ణ, బోడపాటి శ్రీనివాస్, కొలుసు వెంకటేశ్వరరావు, ఎస్.ఎం.ఆర్.కిషోర్, చిర్ల నవీన్, కృష్ణవేణి,భారతి, సూర్యకుమారి, లక్ష్మి,శ్రీదేవి పాల్గొంటారని వివరించారు.జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అల్లు బాబి, డాక్టర్ కంటే వీరన్న చౌదరి, లయన్ గుబ్బల రాంబాబు,బళ్ళ శ్రీనివాసరావు, జి.వి.రమణ,పతివాడ రామరాజు, పి.వి.ఎస్.కృష్ణారావు,యరక కొండబాబు పాల్గొంటారని దొండపాటి సుబ్రహ్మణ్యం తెలిపారు.సంగీత ప్రియులంతా హాజరుకావాలని కోరారు.