posted on Oct 19, 2024 10:26AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం(అక్టోబర్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల లోపు సమయం పడుతోంది.
ఇక శుక్రవారం (అక్టోబర్ 18) శ్రీవారిని మొత్తం 61 వేల 576 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 412 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది.