విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి పథకాన్ని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. అంబాజీపేట మండలం తొండవరం గ్రామ కమిటీ అధ్యక్షులుగా వెన్నపు రాంబాబుని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
తొండవరం వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వెనపు రాంబాబుని గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని తెలిపారు. ప్రదానకార్యదర్యిగా మద్దింశేట్టి మల్లిబాబు , కార్యవర్గ సభ్యులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, పేరబత్తుల కొండలరావు,నాగాబాత్తుల రవిప్రసాద్ , మద్దింశెట్టి కేశవ , ముత్తబత్తుల శివశంకర్ , సాపే రాజారావు, చింతా చిట్టిబాబు, ముత్తబత్తుల మహేష్ సాపే రామక్నష్ణ మద్దింశెట్టి నాయుడు రొక్కాల బాబుజి ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాంబాబు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన తొండవరం గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చిట్టిబాబు రాంబాబుని , నూతనంగా ఎన్నికైన వారిని పూలమాలలతో , దుస్సలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి గుర్తింపు వాటంతట అవే వస్తుందని అన్నారు.