మండలంలో మూడు పంచాయతీలకు ఎన్నికలు ఎంపీడీవో ఎం అనుపమ
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల పరిధిలో మూడు పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయని తాళ్ళరేవు ఎంపీడీవో ఎం అనుపమ మీడియాకు తెలిపారు. వివరాల ప్రకారం జార్జి పేట పంచాయతీ సర్పంచ్ కోలా సత్యవతి అకాల మరణంతో, ఒక సర్పంచ్ రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎన్నికల తేదీని ఈనెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.