WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

యువగళం పాదయాత్రకు వేలాదిగా తరలిరండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువనేత నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గురువారం జాలెం సుబ్బారావు మాట్లాడుతూ…. సెప్టెంబర్ 9 వ తారీఖున మధ్యాహ్నం నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గం నుండి పి గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామంలోకి ప్రవేశిస్తుందన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ 9 వ తారీఖున శనివారం నాడు నగరం గ్రామ ప్రవేశ ముఖ ద్వారం వద్దకు రావాల్సిందిగా జాలెం సుబ్బారావు విజ్ఞప్తి చేసారు. నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రలో నిబద్ధత కల్గిన ప్రతీ తెలుగుదేశం కార్యకర్త క్రమశిక్షణతో పాల్గొవాలన్నారు.

యువతలో నూతనోత్సాహం నింపుతున్న నారా లోకేష్ బాబు కు నగరం గ్రామ ముఖద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలకుతామని జాలెం తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే అకుంఠిత దీక్షతో ఎన్నీ అడ్డంకులు ఎదురైనా నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళుతుండటం ఒక చారిత్రాత్మకమైన విషయమని జాలెం సుబ్బారావు తెలియచేసారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement