విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
వెటర్నరీ నాన్ గ్రాడ్యుయేట్ అధికారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా రామరాజు
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాన్ గ్రాడ్యుట్ వెటర్నరీ ఆఫీసర్ల సంఘానికి 2వ సారి ఉపాధ్యక్షులుగా కె.వి.రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈమేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాన్ గ్రాడ్యుట్ వెటర్నరీ ఆఫీసర్లకు జేవివో/విఎల్వో జరిగిన ఎన్నికలలో సభ్యులు అందరూ గతంలో వీరందరూ సమస్యలుపై పోరాడి సాధించిన అనేక అంశాలను పురస్కరించుకొని మరిన్ని అంశాలను సాధించవలసి ఉన్నందున ఇదే సంఘము ఉండుట వల్ల సభ్యులందరూ ప్రయోజనం పొందగలరని ఆశించి ఎన్నికల విధానములో ఓటింగ్ పద్ధతి లేకుండా ఏకగ్రీవంగా సభ్యులందరినీ ఎన్నుకున్నారు.ఇందులో భాగంగా కే .గంగవరం మండలం దంగేరు గ్రామ వెటర్నరీ వైద్యాధికారి కె.వి.రామరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దీంతో జేవివో,విఎల్వో సంఘానికి రామరాజు 2వ సారీ ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా స్థానిక రైతులందరూ రామరాజుని అభినందించారు.