విశ్వంవాయిస్ న్యూస్, కే గంగవరం:
ప్రమాద అంచున గోదావరి ఎటుగట్టు
ప్రాణభయంతో కరకట్ట అనుకుని వున్న ప్రజలు
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం
కే గంగవరం పరిధిలో ఉన్నటువంటి గోదావరి కరకట్ట ఏటుకట్టు ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ నాయకులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గోదావరిలో ఇసుకను తరలించడానికి ప్రాధాన్యత ఇచ్చారు,తప్ప గోదావరి కరకట్టను, ఏటుగట్టను నిర్మాణం చేయలేదన్నారు.వర్షాలు వస్తున్న సందర్బంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంతో కరకట్ట బలహీనంగా మారిందని,కరకట్ట కి అనుకుని వున్న ప్రాంతాలలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి వచ్చిందని,అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి కరకట్టను పునర్నిర్మాణం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కే గంగవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగ ఉదయ్ కుమార్ సురేష్ బాలిక శివయ్య,నాగేశ్వరరావు, వాసంశెట్టి వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.