మాజీ చైర్మన్ ప్రకాష్…
అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట 5వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డులో ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి వివరించారు. రాబోవు రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వార్డులో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వర ప్రకాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంగరాల రాంబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, బుంగ సంజయ్, గుండు తాతరాజు, ఐదవ వార్డ్ ప్రెసిడెంట్ పాండ్రంగి సత్యనారాయణ, కాట గోపి, శిరీష, కాకి మల్లేశ్వరి, కాకి మంగాదేవి, పీత లక్ష్మి,క్లస్టర్ ఇంచార్జ్ బిఎల్వోలు పాల్గొన్నారు.

