అక్రమ సంబంధమే ముగ్గురి హత్యకు కారణం: ఎస్పీ జి బిందు మాధవ్
అక్రమ సంబంధం వలనేసామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, ట్రైనీ ఆదివారం హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడయిందని నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ వెల్లడించారు. ఈనెల 3వ తేదీన తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్యకు గురైన విషయం తెలిసిందే.మృతురాలు ములపార్తి మాధురి,నిందితుడు తలే సురేష్ మధ్య అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.నిందితుడు మృతురాలి ఆర్ధిక అవసరాలు నిమిత్తం దాదాపు రూ 7లక్షలు వరకూ ఖర్చు చేసినట్లు,నిందితుడి భార్య, మాధురి నుండి వేధింపులు భరించలేక హత్యకు పధకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు.3వ తేదీ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో మాధురి పిలుపు మేరకు వెళ్ళిన నిందితుడు సురేష్ భోజనం చేసి ఆమెతో శారీరకంగా కలిసి ఆమె నుండి ఎదురైన వేధింపులకు కోపోద్రేకుడై వెంట తెచ్చుకున్న దుడ్డుకఱ్ఱతో తలపై గట్టిగా మోది హత్య చేశాడని, ఆమె అరుపులకు నిద్ర లేచిన పిల్లల్ని కూడా అదే కఱ్ఱతో హత్య చేసి ఇంటిలో ఉన్న రూ.2,50,000లు విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడని అన్నారు. కేసు త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు, సామర్లకోట సిఐ ఎ. కృష్ణ భగవాన్, క్రైమ్ సీఐ ఆర్.అంకబాబు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.