మాజీ ఛైర్మన్ ప్రకాష్…
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం గా పనిచేస్తుందని మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట 10,14వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. రాబోవు రోజుల్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.వార్డులో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీ వర ప్రకాష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంగరాల రాంబాబు, పట్టణ టిడిపి అధ్యక్షులు మచ్చ నాగు,10వ వార్డ్ ప్రెసిడెంట్ సబిటి అనిల్, సిరంగు ఈశ్వర్రావు, శెట్టి రవికుమార్ , సాధనాల చక్రపాణి, పిట్ట రాజబాబు, బడుగు రత్నరాజు , నిమ్మలపూడి వినాయకరావు, నిమ్మలపూడి గణేష్, ముత్యాల మెహర్ సుబ్బారావు, బర్రె దుర్గాప్రసాద్, విజయేంద్ర ప్రసాద్ ,క్లస్టర్ ఇంచార్జ్ బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

