డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బీజేపీ సంస్థాగత నియామకాలలో భాగంగా మండపేట నియోజవర్గం రాయవరం మండలం, లొల్ల గ్రామంలో మండల భాజపా అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్ అధ్యక్షతన నూతనంగా జిల్లా పదవులు పొందిన నాయకులను బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కె వి వి సాయిరామ్ ఘనంగా సత్కరించారు. నూతన జిల్లా కమిటీకి ఉపాధక్షులుగా రాయవరం మండలం లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ను రెండవసారి నియమించగా, మరొక ఉపాధక్షులు గా వెదురుపాక కు చెందిన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీదేవి ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా పూర్వ మండల అధ్యక్షులు రాయి వీర్రాజు, తుమ్మలపల్లి సూర్యనారాయణ, నరాల రాంబాబు, అంగర పూర్వపు మండల అధ్యక్షులు తోరం రాము లను నియమించగా, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ గా మండపేట పట్టణానికి చెందిన చుండ్రు భార్గవ్ సాయిరామ్ చౌదరి ను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కోటిపల్లి శ్రావణి, చింతా తమ్మిరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అంగర జనార్ధన స్వామి, ముప్పాటి కృష్ణ, ఈరెళ్ళ కృష్ణమూర్తి, మండపేట బిజెపి టౌన్ అధ్యక్షుడు నాళం ఫణి ప్రకాష్, మండపేట రూరల్ అధ్యక్షుడు పాలిక రమణ, వెత్సా ప్రసాద్, అబ్బిరెడ్డి శాంతారావు, గుబ్బల గోవిందరాజులు, సీనియర్ నాయకులు బండారు సూరిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కోటిపల్లి కృష్ణమాచార్యులు, మండపేట పట్టణ ఉపాధ్యక్షులు పందిరి వీర్రాజు, బుద్దవరపు రాజు తదితరులు పాల్గొన్నారు.