Monday, August 4, 2025
Monday, August 4, 2025

బీజేపీ ఆధ్వర్యంలో బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట

బాబూ జగజ్జీవన్ 39 వ వర్థంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ నాయకులతో కలిసి మెయిన్ రోడ్డు లోని మహనీయుల సెంటర్లో ఉన్న జగజ్జీవన్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోన మాట్లాడుతూ ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన దేశానికి విశేషమైన సేవలు చేశారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధునిగా దేశం కోసం పోరాడిన మహోన్నతుడు అని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ఆయన కృషిని వివరించారు. సమాజంలో సామాన్యులకు హక్కులు కల్పించడంలో అతని పాత్ర ఎనలేనిదన్నారు. గ్రామీణ కార్మికుల కోసం ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, జిల్లా కార్యదర్శి గొడవర్తి రామచంద్రరావు, పట్టణ పూర్వపు అధ్యక్షులు ముద్దుల సుబ్బారావు, పట్టణ ఉపాధ్యక్షులు సందక వీరవెంకట సత్యనారాయణ, శకుంతల, మర్రి రామచంద్రరావు, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo