బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డు ను అందుకున్న దేశంశెట్టి సాయి
ఇటీవల విజయవాడ లో గుజ్జుల సరళ దేవి కల్యాణ మండపం నుందు జరిగిన వై. ఎమ్. కె అకాడమీ ఫాండర్ రూఫస్ పాల్ నిర్వహించిన నేషనల్ స్టార్ట్ ఎక్సలెన్స్ అవార్డు ను సీనియర్ మాస్టర్స్ కేటగిరి లో కోనసీమ జిల్లా అమలాపురం నకు చెందిన సాయి కరాటే క్లాసెస్ ఫౌండర్ దేశంశెట్టి సాయిబాబు కు రావడం జరిగినది. ఈ అవార్డు ను సినిమా స్టార్ హీరో బాను చందర్ చేతులు మీదుగా తీసుకోవడం నాకు చాలా గర్వకారణం గా ఉంది అని కరాటే మాస్టర్ సాయి తెలియచేసారు. ఈ కార్యక్రమం లో నాలుగు రాష్టాల నుండి సుమారు 140 మంది ఈ కార్యక్రమం లో పాలొగొన్నారు. దీనిలో భాగంగా కరాటే, యోగా, క్లాసికల్ డాన్స్ విభాగల లో ఈ నేషనల్ స్టార్ట్ అవార్డు ను ఇవ్వడం జరిగింది.