జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం న్యూఢిల్లీకి వెళ్లి శిక్షణ పొందిన ఏడిద సచివాలయం-1 చెందిన వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, బూత్ లెవల్ అధికారి మాస్టర్ ట్రైనర్ అయినటువంటి నాగం నాగ శివ ద్వారా మండపేట(48) నియోజకవర్గానికి సంబంధించిన 223 బూత్ లెవెల్ అధికారులకు ఐదు రోజులపాటు శిక్షణ కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగిందని ఓటరు నమోదు అధికారి పి కృష్ణమూర్తి మీడియాకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండలానికి చెందిన బూత్ లెవెల్ అధికారులకు ఈ నేల 11వ తారీఖు శుక్రవారం నాడు కపిలేశ్వరపురంలో గల శ్రీ సర్వారాయ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని, రాయవరం మండలానికి సంబంధించిన బూత్ లెవల్ అధికారులకు 14 వ తారీకు సోమవారం రాయవరంలో ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్లో, మండపేట అర్బన్ కు సంబంధించిన బి ఎల్ ఓ లకు 15వ తారీకు మంగళవారం నాడు మున్సిపల్ ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు, మండపేట రూరల్ కు చెందిన బి ఎల్ ఓ లకు16వ తారీకు బుధవారం నాడు మండపేట ఎంపీడీవో ఆఫీస్ వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నందు, తదుపరి మండపేట రూరల్,రాయవరం, కపిలేశ్వరపురం మండలల బి ఎల్ ఓ లకు 17వ తారీఖున గురువారం మండపేట ఎంపీడీవో ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.ఓటరు జాబితా రూపకల్పనలో బీఎల్వోల పాత్ర కీలకమని అందుచేత ఈ శిక్షణ తరగతులకు బీ ఎల్ ఓ లు అంతా విధిగా హాజరై శిక్షణ పొందాలని ఆయన ఆదేశించారు.