విశ్వం వాయిస్ న్యూస్, అమరావతి
ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు, ఐఅండ్పిఆర్ జెడి పి.కిరణ్ కుమార్,ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్లు నాగలక్ష్మి తదితరులు వర్చువల్ గా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
(జారీ చేసిన వారు: డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)
ఏపీలో 199 మంది పోలీసులకు పోస్టింగులు, జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి.. ప్రధాని దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరికీ లేఖలు రాశారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని అందులో చెప్పుకొచ్చారు. ఈ 199 మందిలో ఐపీఎస్ అధికారులు నలుగురే ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అంటే జగన్ సేవలో మునిగితేలి..అప్పటి ప్రతిపక్ష నేతలను వేధించిన వారంతా ఇప్పుడు పోస్టింగులు తెచ్చుకున్నారు. నలుగు ఐపీఎస్లకు మాత్రమే పోస్టింగులు రాలేదు.
అదే సమయంలో 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు , 119 మంది సీఐలు ఈ జాబితాలో ఉన్నారని వీరందర్ని వీఆర్లో ఉంచారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ కోసం ఎంతో తీవ్రమైన తప్పులు చేసిన వాళ్లే వీళ్లంతా. వీరిని...
నిర్మలా హైస్కూల్ లో తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం
విజయవాడలో ఘనంగా స్కూల్ పేరెంట్స్ మీట్
భవిష్యత్తు నిర్మాణానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల జట్టు ప్రయాణం
స్కిల్ ఇండియా, హైకోర్టు అతిథుల స్ఫూర్తిదాయక సందేశాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, విజయవాడ
పటమట నిర్మలా హైస్కూల్ లో గురువారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన చర్చల్లో భాగస్వాములు అయ్యారు. పరస్పర సహకారం ఫలితంగా ప్రభుత్వ సూచనల అమలు సజావుగా కొనసాగింది.
తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కిల్ ఇండియా మిషన్ కన్సల్టింగ్ అడ్వైజర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ కేసి శివ శంకర్, నిర్మలా హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మాథ్యూ, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్...
విద్యార్థి 3 రోజుల గైర్హాజరు – తల్లిదండ్రులకు తక్షణ ఫోన్ కాల్
5 రోజుల గైర్హాజరు – MEO/CRPల ద్వారా ఇంటి సందర్శన
టీచర్లు సెలవు తీసుకుంటే – వెంటనే ప్రత్యామ్నాయ బోధన ఏర్పాటు
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక నిఘా కొనసాగించాల్సిందిగా సూచన
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి
విద్యార్థుల హాజరుపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల హాజరుపై దృష్టి సారించింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, విద్యార్థులు మూడు రోజులకు మించి బడికి రాకపోతే, వారి తల్లిదండ్రులకు వెంటనే ఫోన్ చేయాలని టీచర్లకు ఆదేశించింది.
ఇంతకే ఆగకుండా, ఐదు రోజుల కంటే ఎక్కువ గైర్హాజరు ఉంటే, సంబంధిత మండల విద్యాధికారి (MEO) మరియు క్లస్టర్ రెసోర్స్ పర్సన్ (CRP) లు అయే విద్యార్థి ఇంటికి వెళ్లి కారణాలు తెలుసుకోవాలని సూచించింది. విద్యార్థుల గైర్హాజరును ఖచ్చితంగా గమనిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
టీచర్లు హాజరు, సెలవులపై...