27 October 2025
Monday, October 27, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

ఆంధ్రప్రదేశ్

మండల వ్యాప్తంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు

సచివాలయ అధికారుల పర్యవేక్షణలో 35 పునరావాస కేంద్రాలు రెవెన్యూ, సివిల్ సప్లయ్, పంచాయతీ రాజ్ శాఖల సంయుక్త నిర్వహణ తీవ్ర తుఫాను దృష్ట్యా పలు జాగ్రత్తలు తప్పనిసరి రాయవరం మండల తహశీల్దార్ భాస్కర్ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల వ్యాప్తంగా మంథా తుఫాను ప్రభావం దృష్ట్యా, తీవ్ర తుఫాన్ గా మారిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాయవరం మండల తహసిల్దార్ భాస్కరరావు తెలిపారు. తీవ్ర తుఫాను ప్రభావం వలన బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు సూచనలు హెచ్చరికలను ఆయన చేశారు. పాడుబడిన పెంకుటిల్లు, పూరిపాకల లో నివాసం ఉండేవారు తప్పనిసరిగా ప్రభుత్వం...

సన్మాల ధనరాజు కు వైసీపీ నాయకుల పరామర్శ…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట పట్టణ కమిటి ఉపాధ్యక్షులు సన్మాల ధనరాజు ను మారేడుబాక గ్రామం సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, మండపేట సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెంకే గంగాధర్, నియోజకవర్గం వైసీపీ ఐటి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు లు పరామర్శించారు. స్థానిక 11వ వార్డులో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి…

కోటి సంతకాల ఉద్యమంలో చైర్ పర్సన్ రాణి... విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు.ఆదివారం మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్ కాలనిలో ఆమె ఇంటి ఇంటికి తిరుగుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రవేటికరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారే అవకాశం ఉందని, పేదలకు నడ్డి విరిచే...

వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి

పాఠశాల, హాస్టల్ లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలి విద్యార్థులకు త్రాగునీరు, టాయిలెట్ అవసరాలపై అవగాహన కల్పించాలి తప్పనిసరిగా లేబర్ మూమెంట్ రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలి హెల్త్ అసిస్టెంట్ లకు మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచనలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం హెల్త్ అసిస్టెంట్స్ అందరూ తమ పరిధిలో గల హాస్టల్స్ ను సందర్శించి ఆ పరిస్ధితులను విజిటర్ బుక్స్ లో నమోదు చేయాలని మండపేట సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ సూచించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట యూనిట్ పరిధిలో గల గొల్లపుంత అర్బన్ హెల్త్ సెంటర్ నందు సబ్ యూనిట్ ఆఫీసర్ పి డి డి బిషప్ ఆధ్వర్యంలో శనివారం...

తుఫాను, అధిక వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పలు సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం రాష్ట్రం లో తుఫాను వర్షాల హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర వరి రైతాంగం దిగువన ఉదహరించిన జాగ్రత్తలు చేపట్టి పంట నష్టాన్ని నివారించుకొవాలని మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ గురువారం పలు సూచనలు చేశారు. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదని, కోసిన పూర్తిగా ఆరని పనలను తుఫాను వాతావరణ నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనల పై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై...

రెడ్డి జానకి రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన పలువురు …

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ మాజీ గౌరవ అధ్యక్షులు రెడ్డి జానకి రామయ్య(87) ఇటీవల మృతి చెందారు. ఈయన మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ కు పెద్ద నాన్న అవుతారు. పాటి మీద ఆయన స్వగృహానికి వెళ్ళి పలువురు పరామర్శించారు.ఆయన మనుమలు చోడే రాంబాబు, పెనుమర్తి సూర్య, వారి కుటుంబ సభ్యులను బిక్కిన పెద్ద చిన్న, బిక్కిన వీరబాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్,టెకీముడి శ్రీనివాస్ , నాయకులు తాడి రామారావు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల రాంబాబు, రామోజు కృష్ణ,పంపన శ్రీను, పిఠాపురం సత్యనారాయణ పరామర్శించారు

కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కంటి తుడుపుగానే ఉంది…

బాధితులకు ఎక్స్‌గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలి...   ఎమ్మెల్సీ తోట డిమాండ్... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ విస్ఫోటనం ఘటనలో పదిమంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత...

అన్నపూర్ణమ్మ ఆలయం లో మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ ప్రత్యేక పూజలు

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట మండపేట బురుగుంట చెరువు గట్టు వద్ద గల అన్నపూర్ణమ్మ సమేత అమృతలింగేశ్వరస్వామి వారి దేవాలయంలో దీపావళి ను పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని బంగారు చీరతో అలంకరించారు. మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆలయానికి విచ్చేసి అమ్మ వారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ప్రకాష్ వెంట ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్, కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం తదితరులు ఉన్నారు.

పర్యావరణ హితమైన దీపావళి జరుపుకుందాం

చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు విశ్వం వాయిస్ న్యూస్, మండపేట దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి...

పక్కదారి పడుతున్న దీపం లక్ష్యం

వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo