డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు
సాస్కి పథకం కింద గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు
గండికోటలో ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశ్వం వాయిస్ న్యూస్, గండికోట
పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందని అన్నారు. దీంతో పాటు 13 శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, ఆ తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా ఉందని స్పష్టం చేశారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు...