14 October 2025
Tuesday, October 14, 2025

చిట్టీల పేరుతో 2 కోట్లకు టోక్రా…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

లబోదిబో మంటున్న భాదితులు

తిరుగుడుమెట్టలో కలకలం

విశ్వం వాయిస్ న్యూస్, తాళ్లపూడి

తాళ్లపూడి మండలం టి.మెట్ట గ్రామం లో చిట్టీల వేస్తూ కిరణ వ్యాపారం చేస్తున్న బెల్లంకొండ సత్యనారాయణ అనే వ్యక్తి భార్య తో సహా పరారయ్యారు. దీనితో టి.మెట్టలో చిన్న పెద్ద కుటుంబాల జనం లబో దిబొ మంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ లు గ్రామానికి రావటం, తమ డబ్బులు దాచుకున్న వారు గగ్గోలుంపెడుతూ రోడ్డెక్కటం మొత్తం మీద గ్రామం అంతా గంధర గోళం గా మారింది. వడ్డీ వస్తుందని కొంత మంది ఒకరికి తెలియకుండా ఒకరు బెల్లంకొండ సత్యనారాయణకు అప్పులిచ్చామని, చిట్టి పాడుకున్నా డబ్బునివ్వలేదని పలువురు మహిళలు సైతం వాపోతున్నారు. పఱరైన బెల్లంకొండ తో భార్య కూడా వెళ్లిపోయిందని, బాకిల వాళ్ళు వేధిస్తున్నారని భయం తో వూరు వదిలి వెళ్లిపోతున్నట్లు, ఒక ఉత్తరం వ్రాసి వెళ్లిపోయారని సమాచారం. ఇంటి తాళం వేసి ఉందని ఇంట్లోకి వెళితే మరికొన్ని విషయాలు తేలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఊరువదిలి పోయిన బెల్లం కొండ కు ఇద్దరు కుమారులుండగా ఒకరు లండన్, మరొకరు హైద్రాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారని సమాచారం.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo