చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారైన మోసగాడ
అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మి డివరం నియోజకవర్గంలో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసి పరారయ్యాడు ఓ మాయగాడు..
వివరాల్లోకి వెళితే ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీర శంకర రావు(బుజ్జి) గత కొన్నే ళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, స్దానికుల వద్ద నమ్మకం పెంచుకున్నాడు. అయితే ఇటీవల పాడుకున్న చిట్టీల తాలూకూ సొమ్ములు ఇవ్వకుండా సాకులు చెబుతూ హఠాత్తుగా గ్రామం నుండి అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు .ఈ ఘటనపై స్దానిక ఎమ్.ఎల్.ఎల్ దాట్ల సుబ్బరాజును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు ఎమ్. ఎల్.ఎ సూచనతో బాధితులు
పోలీసులకు పిర్యాదు చేసారు..
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఐ.పోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. సుమారు వంద మంది వద్దనుండి అధిక మొత్తంలో సొమ్ములు రాబట్టుకొని బుజ్జి
అర్దాంంతరంగా పరారయ్యాడని బాధితులు చెబుతున్నారు