ఎందరో మహనీయుల త్యాగ ఫలాలతో వచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఉల్లాహ్ అన్నారు. శుక్రవారం దొమ్మేరు గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేశారని స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారని అన్నారు. కుల మత పేదలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని దానికి కారణం జాతిపిత మహాత్మా గాంధీ చలవే అని అన్నారు.ఈ కార్యక్రమానికి చాగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టా సుబ్బారావు , తాళ్లపూడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు K.బుల్లి స్వామి, కొవ్వూరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కే లక్ష్మి ,ప్రచార కమిటీ కొవ్వూరు చైర్మన్ జనుకోటి రవికుమార్, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాక పుల్లారావు, సీత వెంకటేశ్వర్లు, కలగర్ సుబ్రహ్మణ్యం ,కే చంద్రశేఖర్, ఎస్ వల్లి, ముదునూరి రాజు తదితరులు పాల్గొన్నారు.