జగ్గంపేట సర్కిల్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ గండేపల్లి ఎస్సై శివ నాగబాబు నేతృత్వంలో క్యూఆర్ టి (క్విక్ రెస్పాన్స్ టీమ్) బృందాలు పాల్గొని తామరాడ, గోనేడ, సోమారాయణంపేట, పాలెం, రామచంద్రపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది .ఈ తనిఖీల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, అనుమానాస్పద ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని అధికారులు తెలిపారు.ప్రజల మధ్య భద్రతా విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి తనిఖీలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయని, ఎటువంటి శాంతిభంగం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలిపారు.