గంగాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల
గోకవరం మండలం రంపయర్రం పాలెం గ్రామంలోని శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు పురస్కరించుకుని, గురువారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఘన స్వాగతం పలికి, పూలమాలతో సత్కరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, భక్తులకు తీర్థ ప్రసాదాలు వట్టించారు. జాతర ఉత్సవాలకు, అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు రెండు లక్షలు రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతర కృషి చేస్తానన్నారు. మన సాంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల నానాజీ, కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, పసల గణేష్, దేశాల నరేష్, కాళ్ళ బుజ్జి, సత్యవతి, మళ్ల సుభద్ర, కాకర దుర్గారావు, నండూరి దుర్గారావు, మందపాటి సతీష్, బాతు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు…