అశ్లీల ప్రదర్శనలు లేకుండా చూడాలని కౌన్సెలింగ్ చేసిన
జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్
కిర్లంపూడి ఎస్సై జి.సతీష్
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో వెలిసిన శ్రీ వారేలమ్మ తల్లి 2వ వార్షికోత్సవ వేడుకలు కమిటీ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల సందర్భంగా గురువారం ఉదయం జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ ఆలయ ప్రాంగణానికి చేరుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.ముందుగా వారు అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి గరగల ప్రదక్షిణ తిలకించారు. తర్వాత గుడి కమిటీ సభ్యులతో సమావేశమై ఎటువంటి అశ్లీల నృత్య ప్రదర్శనలు లేకుండా చూడాలని, వేడుకల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ,కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ ,పి ఎస్సై రాజా వారి సిబ్బంది,నీలం శ్రీనివాస్, నీలం శేఖర్, నీలం శ్రీను (తుగ్లక్ )తో పాటు గుడి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.