రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో ప్రసిద్ధి చెందిన విజయదుర్గ పీఠాధిపతి గాడ్ ను,గురుపూజోత్సవం సందర్భంగా, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి గురువారం దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మండపేట నియోజవర్గ కన్వీనర్ కెవివి సాయిరాం,అనకాపల్లి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, రాయవరం మండల బిజెపి అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరాల రాంబాబు జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ చీరట్ల సుబ్బారావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని రవీంద్రబాబు, కొత్తపల్లి శ్రీదేవి, కరుటూరి శ్రీనివాస్, కోన సత్యనారాయణ, గొడవర్తి రామచంద్రరావు, మండపేట పట్టణ అధ్యక్షుడు నాళం ఫణి ప్రకాష్, మండపేట రూరల్ అధ్యక్షుడు పాలిక రమణ, బండారు సూరిబాబు, సూరంపూడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

