జిల్లాలో నిర్మాణ రంగాలకు అవసరమైన డిమాండ్ మేర కు స్టాకు యార్డు ల ద్వారా ఇసుక ను సరఫరా చేయా లని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీవోలు భూగర్భ గనుల శాఖ అధి కారులు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యుల తో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతిలేని స్టాక్ పాయిం ట్ల వద్ద ఇసుకను స్వాధీనం చేసుకో వాలని ఆదేశిం చారు.ఇప్పటికె కపిలేశ్వ రపురం ఇసుక రీచ్ వద్ద 55 వేల మెట్రిక్ టన్నులు అమ లాపురం నందు 2,360 మెట్రిక్ టన్నులు పి గన్నవరం లో 436 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకు న్నట్టు తెలిపారు. స్వాధీన పరుచుకున్న ఇసుకను టన్నుకు నిర్దేశించిన ఖర్చును రాబడుతూ సరఫరా చేయాలని ఆదేశించారు వర్షాకాలం డిపోల లో ఇసుక అమ్మకాలు, స్టాక్ యార్డ్ లో నుండి డిమాండ్ కు అనుగుణంగా చేయాలన్నారు. జిల్లావ్యా ప్తంగా పది వేల మెట్రిక్ టన్నుల వరకు నిర్మాణ రంగాలకు రోజువారిగా డిమాండ్ ఉందని ఆ ప్రకారం సప్లై చేయాలని ఆదేశిం చారు. మండల డివిజన్ స్థాయిలలో నియమింపబడ్డ టాస్క్ఫోర్స్ టీములు పర్య వేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ పారద ర్శకంగా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ హియరింగ్ , సి ఆర్ జెడ్ పర్యావరణ అనుమతులు అంశాలపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి, ఆర్డీవోలు పి శ్రీకర్ దేవరకొండ అఖిల, డిపిఓ శాంతిలక్ష్మి భూగర్భ గనుల శాఖ ఏడి ఎల్ వంశీధర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు, రహదారులు భవనాల శాఖ జలవనరుల శాఖ ఇంజనీర్లు, జి ఎస్ డబ్ల్యూ ఎస్ కోఆర్డినేటర్ సు విజయ్