జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాలలో ఉన్న నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం కల్పిస్తూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు సంస్థ వికాస సౌజన్యంతో జూలై 5వ తేదీ ఉదయం 9 గంటలకు గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడ్రన్ డిగ్రీ కళాశాలలో ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 1350 ఖాళీలతో అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగం అవకాశం కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని జ్యోతుల నవీన్ తెలియజేశారు.