కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్
కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలను విస్మరించింది.రాజ్యసభ సభ్యులు బోస్
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ :-
రామచంద్రపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైయస్ ఆర్ సిపి రామచంద్రాపురం పట్టణ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ముఖ్య అధితులుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఇరువురు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేసి, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీల పట్ల ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అలానే ఈ కార్యక్రమం వార్డుల స్థాయిలో కూడా విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకులు కుడుపూడి శ్రీనివాస్ రావు,మున్సిపాలిటీ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి,జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి,మరియు కౌన్సిలర్స్,సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు.