Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

కొలంక కేశవస్వామికి వెండి కవచం బహుకరణ  రూ 7లక్షల విలువ చేసే వెండి కవచం అందజేత

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కొలంక కేశవస్వామికి వెండి కవచం బహుకరణ

 

రూ 7లక్షల విలువ చేసే వెండి కవచం అందజేత

విశ్వం వాయిస్ న్యూస్, కొలంక

కాజులూరు మండలం కోలంక గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ కేశవస్వామి వారికి క్షత్రియ పరిషత్ సభ్యులు వెండి కవచం బహుకరించారు. ఈమేరకు శనివారం 7 లక్షల రూపాయలు విలువచేసే వెండి కవచాన్ని ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో దంతులూరి వెంకట విజయ గోపాలకృష్ణంరాజు కృష్ణవేణి దంపతులచే సంప్రోక్షణ అనంతరం ఆలయ అర్చకులకు అందజేశారు. దంతులూరి కుటుంబీకులైన సాధు కృష్ణ వర్మ, వెంకట సత్యనారాయణ రాజు, వెంకట నరసింహారాజు, విశ్వనాథ వెంకటకేశవరాజు, కృష్ణ వర్మ, వెంకటరాఘవరాజు, సుబ్బరాజు, వెంకటతిరుపతిరాజు ఆర్థిక సహకారంతో సంయుక్తంగా స్వామి వారికి అందజేశారు. ఈ సందర్భంగా సాదు కృష్ణవర్మ మాట్లాడుతూ ఈపురాతన ఆలయానికి ఉన్న పేరు ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు ఇక్కడ చేసే అర్చనలకు భక్తులకు ఎంతో నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని మరింత విస్తృత పరిచేందుకుఇక్కడ జరుగుతున్న శుభకార్యాలు ప్రాచుర్యం చేయడానికి, మరింత పెంపొందించేందుకు దేవాలయానికి ఈ వెండి కవచం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ సభ్యులు దంతులూరి నరసింహరాజు, దాట్ల బుచ్చిబాబు దంతులూరి వంశీ పలువురు క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo