క్రీడల్లో రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని అంతేకాకుండా క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో 49 వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ చాంఫియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్ధులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా అత్యున్నత శిఖరాలు చేరుకోవచ్చునన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమేనని, ఓటమి గెలుపుకు నాంది కావాలి అని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావలని కోరారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టెన్నికాయిట్ ఆటగాళ్లకు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొద్దిసేపు ఎమ్మెల్యే టెన్నికాయిట్ ఆడి అందరిని అలరించారు. టెన్నికోయిట్ కోచ్ కుంచె రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.