ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా…
జెఏసి సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ…
మండపేట ప్రజల ఆకాంక్ష మేరకు మండపేట ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తను ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మండపేట లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం జెఏసి చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట టౌన్, మండలం విలీనం చేసేందుకు ఇక్కడి ప్రజలు వంద శాతం సుముఖంగా ఉన్నారన్నారు. కాగా కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో లోగడ విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు.ఆ రెండు మండలాలకు సంబంధించి మెజార్టీ ప్రజల కోరుకునే విధానం లో పనిచేస్తానని స్పష్టం చేశారు.ఆయా గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు ఇవ్వాలన్నారు. దీని ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.