దళిత వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో నీ కుమారుడు శ్రీకాంత్ ను జైలుకు పంపించాడన్న కారణంతోనే అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్పై కక్ష కట్టావా అంటూ బీఎస్పీ నాయకులు బి కె వై సి నాయకులు అల్లవరం మండలానికి చెందిన పలువురు దళిత నాయకులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్పై మండిపడ్డారు.మీరు అధికారంలోకి అధికారంలో వచ్చాక మీరు కక్ష పూరితంగా ఆయన్ను వీఆర్లోకి పంపి జైలుకు పంపిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలోని వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి విశ్వరూప్ అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్పై చేసిన వ్యాఖ్యలపై అల్లవరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అల్లవరంలోని గోసంగివారిపేటలో ఓ ఇంటిపై కొందరు అల్లరి మూకలు దాడిచేసి బైక్కు, ఇంటికి నిప్పు పెడితే దానిపై చట్టపరంగా చర్యలు తీసుకున్న పోలీసు అధికారికి రాజకీయ రంగు పులిమి ఇష్టాను సారంగా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరన్నారు. దళితులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన మీరు లేని ప్రేమను నటిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నావన్నారు. గోసంగివారిపేటలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసిన క్రమంలోనే కొంత మంది దొరికిపోయారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మీ కుమారుడిపై హత్యా ఆరోపణల విషయంలోనూ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశావని, అయితే అదెవరూ నమ్మలేదన్నారు. తామూ దళితులమేనని, కోనసీమ అల్లర్లలో మీ ఇంటిపై దాడికి పాల్పడిన సంఘటనలో ఇదే సీఐ ప్రశాంత్కుమార్ మీ దగ్గర పనిచేస్తే అప్పడు మంచివాడు.. ఇప్పుడు మంచివాడు కాదా అని ప్రశ్నించారు. తామూ దళితులమేనని, దళితులమైన మాకు న్యాయం చేసినందుకు పోలీసు అధికారిని జైలుకు పంపుతావా అంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో నూకపెయ్యి సత్యనారాయణ, జుత్తుక సత్యనారాయణ, వడ్డి వీరాస్వామి, రొక్కాల నాగేశ్వరరావు, శెట్టిబత్తుల తులసీరావు, నూకపెయ్యి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.