వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్తో కలసిన ఏడిద పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు,దలిత నేత పలివెల సుధాకర్. అలాగే కూటమి ప్రభుత్వా అక్రమ అరెస్టుతో జైల్లో వేధింపులకు గురై బెయిల్ పై బయటకు వచ్చిన బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ను కలిశారు. ఈ సందర్భంగా పలివేల సుధాకర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ ఏడాదికే కూటమి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్ సీఎం, మండపేట ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్త పరిచారు.