14 October 2025
Tuesday, October 14, 2025

మాజీ ఉపరాష్ట్రపతికి బాలరాముని విగ్రహం బహూకరణ…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ బాలరాముని విగ్రహాన్ని బహూకరించారు. గన్నవరంలోని స్వర్ణభారత్ ట్రస్టులో బీజేపీ సీనియర్ నాయకుడు వల్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాజీ ఉప రాష్ట్రపతిని శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పంచలోహాలతో తయారు చేసిన బాలరాముని విగ్రహాన్ని జ్ఞాపికగా అందించారు. శ్రీనివాస్ కళానైపుణ్యాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఎంతో అందంగా తయారైన విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుక్కపల్లి నాగేశ్వరరావు, అయోధ్య తెలుగు వారి నిత్యాన్నదానం ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo