రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి , విజయభాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
అభివృద్ధి , సంక్షేమం చూడలేక చేస్తున్న వ్యాఖ్యలు ఇవి..!
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి.
వ్యాఖ్యలను ఖండించిన ఎటపాక టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్
ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి , విజయభాస్కర్ పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , తెలుగు యువత నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ హితవు పలికారు. ఎటపాక మండల కేంద్రంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం హాయాంలో అవినీతి ఆరోపణలలో ముందున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి , ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ , నేడు ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు , మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.13 వేలు వంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడుందని వారు ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన వంతు సాయం అందించడం చేస్తున్న ఎమ్మెల్యే శిరీష దేవిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని అన్నారు. వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని , మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పాలడుగు నవీన్ , బూత్ ఇంచార్జ్ దుద్దుకూరి రాము , రాసాల చంటి , తదితరులు పాల్గొన్నారు.