ఇటీవల ఆసుపత్రులలో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 40 మందికి రూ.18,40,380/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి. చెక్కులను గురువారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

