డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం
ముమ్మిడివరం – విష్ణాలయం సెంటర్లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు
విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..రోడ్ల పక్కనే నిరీక్షించాల్సి వస్తోంది.. ముఖ్యంగా వృద్ధులు,గర్భిణులు, విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం..గత 25 ఏళ్లుగా బస్టాండు నిరుపయోగంగానే మిగిలింది..విద్యార్థిని విద్యార్థులు స్కూల్స్ ముగిశాక బస్సు కోసం ఎండలోను, వానలోను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 33 జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారు..30 పడకల ప్రభుత్వాసుపత్రి, సబ్ డివిజన్ కార్యాలయాలు, పోలీసు సర్కిల్ కార్యాలయం, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి..దీంతో అనేక మంది నిత్యం ముమ్మిడివరానికి రాకపోకలు సాగిస్తుంటారు..1992లో కేశవస్వామి దేవస్థానానికి చెందిన 1.68 ఎకరాల భూమిలో బస్టాండు నిర్మాణానికి అప్పటిరవాణా శాఖ మంత్రి పెన్మెత్స సాంబశివరాజు శంకుస్థాపన చేశారు.రూ.10 లక్షలతో నిర్మాణం పూర్తయిన తర్వాత 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బస్టాండును ప్రారంభించారు..బస్టాండు 30వేల మంది నిత్యం ఇటువైపే రాకపోకలు సాగిస్తారు. కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర నగరాలకు ఎక్స్ప్రెస్, నాన్స్టాప్,లగ్జరీ, ప్యాసింజర్ బస్సులు నడుస్తున్నాయి..బస్సులు రాకపోకలు సాగించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి…