రాయవరం మండలం నదురుబాద గ్రామంలోని ఎమ్.పి.పి స్కూల్ లో, గ్రామ సర్పంచ్ సిహెచ్. శ్రీనివాసరావు ఆద్వర్యంలో బుధవారం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్టులను అందచేసారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు , ప్రైవేట్ పాఠశాల వసతుల కంటే మంచి సౌకర్యాలు అందుతున్నాయని విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్, స్కూల్ బ్యాగ్,బూట్లు,సాక్స్,బెల్టు,టైం, నోట్ బుక్స్, డైరీ, డిక్షనరీ వంటివి, ప్రభుత్వం విద్యార్థులకు అందించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు, ఈ అవకాశాలను వినియోగించుకుని, విద్యార్థులంతా చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు కిట్లను అందించారు, ఈ కార్యక్రమంలో నదురుబాద గ్రామ పంచాయతీ సెక్రటరీ జి. జనార్దన్ రావు, ఉపాధ్యాయురాలు తడాల దుర్గాదేవి, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు