జిల్లా ఓటర్ నమోదు అధికారి పి.కృష్ణమూర్తి…
బూత్ లెవల్ అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం (48) ఓటర్ నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురువారం నాడు మండపేట ఎంపీడీవో కార్యాలయంలో మండపేట మండలం,రాయవరం మండలం,కపిలేశ్వరపురం మండలలకు సంబంధించిన 42 మంది బూత్ లెవెల్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.ఓటర్ నమోదు అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలక్టర్ పి.కృష్ణమూర్తి మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరించరాదని శిక్షణ తరగతులను సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ శిక్షణ తరగతులు అనంతరం ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన గూగుల్ లింక్ ద్వారా పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు తదుపరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమాలు11.07.2025 వ తేదీ నుండి 5 బ్యాచ్ లతో 17.07.2025 వ తేదీతో ముగిసినవి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి.తేజేశ్వరరావు, డిప్యూటీ తహసిల్దార్ పీ ఏ మెహర్ బాబా,టిడిపి మాజీ అద్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి నాయకులు మేడపాటి రవీంద్రారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు పాలిక రమణ, పందిరి వీర్రాజు ,మాస్టర్ ట్రైనర్ నాగం నాగ శివ, సీనియర్ అసిస్టెంట్ మేకా శ్రీనివాస్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆంజనేయులు, మూడు మండలల బి ఎల్ ఓ లు,తదితరులు పాల్గొన్నారు.