నాటు సారాయి రహిత గ్రామాలుగా తీర్చి దిద్దుతున్న ఎక్సైజ్ పోలీసులు
కాకినాడ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నార్త్ పరిధిలోని గ్రామాలను నవోదయంపథకంలో భాగంగా నాటు సారాయి రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు సీఐకే రామ్మోహన్రావు మంగళవారం తెలిపారు. వివరాల ప్రకారం సామర్లకోట మండలం, వీకేఆర్ పురం గ్రామాలను నాటు సారాయి రహిత గ్రామాలుగా ప్రకటిస్తున్నట్లు,ఈ గ్రామాలలో గ్రామ సర్పంచ్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పంచాయతీ అధికారుల సమన్వయంతో నవోదయం పథకంపై విస్తృత ప్రచారం చేసి నాటు సారాయి విక్రయిస్తున్న వారిని గుర్తించి వారికి ఇతర జీవనోపాధి అందించే విధంగా చర్యలు తీసుకుని పూర్తిగా నాటు సారాయి ఆ గ్రామాలలో నిర్మూలన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ కె రామ్మోహన్రావు, ఎస్సై ఎంవివిబి కుమార్, గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, వీఆర్వో సంజీవరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.