సోమేశ్వరం గ్రామంలో నేషనల్ డివార్మింగ్ డే ప్రోగ్రాం
స్థానిక కూటమి నాయకులు సహకారం
అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళవారం రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో స్థానిక కూటమి నాయకులు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శాకా నాగేంద్ర, ఎల్లే కిషోర్ సహకారంతో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు (ఆల్బెండజోల్ 400ఎమ్.జి) ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఎమ్.ఎ.ఎన్.ఎమ్ రామలక్ష్మి, ఎం.ఎన్.ఎమ్ రమాదేవి ఆధ్వర్యంలో మింగింపచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలలో నులిపురుగుల తో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని, తల్లిదండ్రులు పిల్లల శుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు, గోర్లు పెరగకుండా కత్తిరిస్తూ, భోజనానికి ముందు, మల,మూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తినే ఆహార పదార్థాలపై మూతలు వేసి ఉంచాలని, రోడ్ల ప్రక్కన దొరికే అపరిశుభ్రమైన తినుబండారాలు తినకూడదని విద్యార్థులకు సూచించారు, ఈ నులి పురుగులు వలన రక్తహీనత, మతిమరుపు లాంటి లక్షణాలు ఉంటాయని, అల్బెండజోల్ మాత్రలు వేయడం వల్ల వాటిని నివారించవచ్చన్నారు.1-3 సంవత్సరాల లోపు పిల్లలు 200mg, 3-19 సంవత్సరాల లోపు వారికి 400mg వేసుకోవడం ద్వారా పిల్లలలో రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.హెచ్.పి సుగుణ, హెచ్.ఎ గణేష్ , ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, కనకదుర్గ, బుజ్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.