Monday, August 11, 2025
Monday, August 11, 2025

పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పేకాట శిబిరంపై కోరింగ పోలీసులు మెరుపు దాడులు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు

కాకినాడ జిల్లా ఎస్పీజి బిందు మాధవ్ ఐపీఎస్ కు అందిన సమాచారం మేరకుఎస్పీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కోరింగ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బందితో పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేశారు. దాడిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 27600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు సుంకరపాలెం ఇంజరం తాళ్ళరేవుయానాం పరిసర ప్రాంతాలకు చెందినవారు. తాళ్ళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆర్ఆర్ ఇన్ హోటల్ పై కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ దాడి చేయగాహోటల్ ను లీజుకు తీసుకుని సదరు హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎస్సై గుర్తించారు. హోటల్ లోని రూమ్ నెంబర్ 4 లో చింతలపూడి హర్ష నాగ వర్ధన్ అనే వ్యకి ఆధ్వర్యంలో నంది కోళ్ల శ్రీనివాసరావు, మందపల్లి ప్రసాద్, చింతాకులు దుర్గాప్రసాద్, మామిడిశెట్టి ఏసుబాబు, పువ్వల ప్రదీప్ కుమార్, పలివెల రాములు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరంతా డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్నందున ఎస్ఐ వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 27,600 నగదు, ఏడు సెల్ ఫోన్లు, 104 పేక ముక్కలను స్వాధీనపరచుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఘోరంగా ఎస్సై పి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కడైనా,ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, వ్యభిచారం తదితర నేరాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
అలూరి సీతారామరాజు
సినీ వాయిస్
టెక్నాలజీ
సక్సెస్ వాయిస్
తెలంగాణ
తీర్పు వాయిస్
క్రీడా వాయిస్
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo