Monday, August 4, 2025
Monday, August 4, 2025

పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన సదస్సు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

క్యాన్సర్‌ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పీఎంపీ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు అన్నారు. పీఎంపీ  అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గొల్లపుంత రోడ్డులో వున్న ఏఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాలులో అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  ముఖ్య అతిథిగా అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం కాలంలో క్యాన్సర్‌ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగివుండాలని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీల వల్లే ప్రాథమిక వైద్యం అందుతుందన్నారు. రాజమండ్రి డెల్టా హాస్పిటల్‌ ఎక్సిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రిమ్మలపూడి  నితిన్‌ మాట్లాడుతూ పీఎంపీలు ఎప్పటికప్పుడు  అధునాతన వైద్య విధానాలు, శస్త్రచికిత్స విధానాల గురించి అవగాహన పొందాలని సూచించారు. సమావేశంలో  పీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ళ రాంబాబు, అసోసియేషన్‌ నాయకులు బల్లా శ్రీనివాసరావు, సూరంపూడి వీరభద్రరావు, మట్టా వీరబాబు, బల్లా వెంకటరమణ, ఇరవాడ రవి, కొప్పిశెట్టి వెంకటేశ్వర్లు, మేడిశెట్టి రామకృష్ణ,  పున్నం రాము, పొన్నాడ శ్రీనివాస్,ఐ ఎస్ ఎల్ ప్రసాద్,ఏడిద లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo