వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహం అర్తమూరు గ్రామం లో అభిమానులు నాయకులు మధ్య ఘనంగా నిర్వహించారు. పాపారాయుడు అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మండపేట ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ లో పేదలకు అన్నదానం చేశారు. తమ అభిమాన నాయకుడు ఆరోగ్యంతో చిరకాలం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరారు. పాపారాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోట త్రిమూర్తులు నాయకత్వంలో అందరూ పని చేయాలని కోరారు. తిరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎంగా చూడాలని తోట త్రిమూర్తులు ను మండపేట నియోజవర్గం ఎమ్మెల్యే గెలవాలనికోరారు. పార్టీ పట్టిష్టతకు పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి డైరెక్టర్ పలివెల సుధాకర్ , జడ్పిటిసి కుడుపూడి భవాని రాంబాబు, సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, పెంకే గంగాధరం, సూరంపూడి సత్యప్రసాద్, ఎంపీటీసీలు అడ్డాల శ్రీదేవి రామరాజు, పంపన లక్ష్మీ పద్మారావు, సీనియర్ నాయకులు వల్లూరి రామకృష్ణ ,సాధనాల శివ భగవాన్, పమిడిపల్లి నానాజీ, వాసంశెట్టి శ్రీనివాస్, పైడిమల్ల రాజు, ఖండవల్లి చిన్న రాజు, ఖండవిల్లి నవ్య తేజ, దాకమరి ప్రసాద్, తమలంపూడి సతీష్ రెడ్డి , ఆయన అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.