మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ ఆధ్వర్యం లో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.టి కె వి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత సైనికుల త్యాగాలను నిస్వార్థ సేవను కొనియాడారు. యువత ఆర్మీ లో చేరి దేశసేవ చేయాలని సూచించారు. ఆపరేషన్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ వార్ 1999 డాక్యుమెంటరీ డిజిటల్ స్క్రీన్ పై చూపించి,విద్యార్ధులలో స్పూర్తి నింపారు. లెఫ్టినెంట్ కమాండర్ డాక్టర్ కె ఎస్ ఆర్ భారత ఆర్మీ, నౌకాదళం, వాయుసేన విభాగాల సేవలను విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్, అధ్యాపకులు శంకర్, కిరణ్, వెంకన్న, గోపాలకృష్ణ, రామకృష్ణ, సుందర్, శ్రీకాంత్, బాబూరావు, రాజేష్, చంటి, అంజి అభినయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.