*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చిన అర్జులను తక్షణమే పరిష్కరించాలి ఎస్.ఈ పి. వెంకట్రావు ఆదేశాలు*
కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కాక వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ ఎస్.ఇ. పి. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఎస్.ఇ. పి. వెంకట్రావు పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేసారు. శానిటేషన్, విధిలైట్లు, హౌసింగ్, తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 6 అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు ఎస్.ఇ పి. వెంకట్రారు అందజేసారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను పరిశీలించి నాణ్యమై పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతాకు ముందు నిర్వహించిన డయల్ యువర్ కమీషనర్ కార్యాక్రమంలో. ఇన్చార్జీ మేనేజర్ రామశాస్త్రి పాల్గొని ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్, టిపిఆర్వో శైలాజ, రెవెన్యూ సూపరింటెండెంట్ శిరిష్, తదితరులు పాల్గొన్నారు.